Wednesday, June 16, 2010

ఆ కులాల మోడల్స్ ఆమోద యోగ్యమే!!

నేను కుల వ్యవస్థను గూర్చి చర్చించ గలిగినంత చరిత్ర చదివిన దాన్ని కాదు.

కాని సమకాలీన పరిస్థితులను, మా తాత గారి నాన్న గారి తరం వరకు వాళ్ళు చెప్పిన నేను గమనించిన విషయాల అవగాహనతో ఈ విషయం పై అనిపించిన విషయాలు చెప్పాలనుకొంటున్నాను.

శారద గారు ఎప్పుడో 'ఈ మాట'లో రాసిన కధ  లొ చెప్పినట్లు, కుటుంబం పరిధి దాటి, కులాలను, ప్రాంతాలను,  వృత్తులను, మతాలను, దేశాన్ని, జాతులను, భాషను ప్రాతిపదికగా మనం కొన్ని ర్రూపులు గా ఏర్పడతాము. ఇంత కంటే విశాలమైన విశ్వైక మతం అభిలషనీయమైనా అది ఇప్పట్లో అసాద్యం. ఈ గ్రూపుల వల్ల లాభాలు కొన్ని నష్టాలు అనేకం. గ్రూపు మంచి గురించి మాత్రమే ఆలోచిస్తే లాభం, మంచి గురించి ఆలోచిస్తున్నాం అనుకొంటూ పక్క గ్రూపు నాశనం గూర్చి మాత్రమే ఆలోచిస్తే నష్టం.

కనుక ఏ గ్రూపు విజయం లోనించైనా మనం మంచి మాత్రమే గ్రహించి ఆచరిస్తే ఇతర గ్రూపులకు కూడా ఆ సక్స్ స్ అందుతుంది. బ్రిటీషు వారు వదలి వెళ్ళేనాటికి వ్యవసాయ దారులు, జమీందారులు అయిన ఒక కులం వాళ్ళు ఇప్పుడు పారిశ్రామిక వేత్తలు, ప్రొఫెషనల్స్, రాజకీయ నాయకులు, ఎక్కువ సంఖ్య లో ఉన్న యెన్నారైలు అయ్యారంటే, దీని వెనక వాళ్ళ కృషి ఏంటి అనేది గ్రహిస్తే అది ఇతరులకు ఉపయోగిస్తుంది. వారు చదువులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళకులాల్లో చదుకొనేవారి కోసం స్కాలర్ షిప్స్, హాస్టల్స్ ఎలా ఏర్పాటు చేసారు, ఎలా మీటింగ్ ల ద్వారా వాళ్ళ గ్రూప్ లొ ఇతరులకు ఈ విషయాల పై అవగాహన కలిగించారు అన్నది తెలుసుకొని పాటిస్తే మంచిది. తరాలనుండి వాళ్ళ వద్ద ఉన్న డబ్బుని, ఆస్థులను ఎలా తెలివిగా కొత్త ఇన్వెష్ట్ మెంట్స్ చేసారు, ఎలా శ్రమతో వాటిని పెంచారు అన్నది తెలుసుకోవాలి.

అలా కాక వాళ్ళు ఒక కులం పై వ్యతిరేకించి నిందించటం వల్ల గెలిచారు అనే చెత్త కంక్లూజన్స్ తీసుకొంటే మంచి చెయ్యక పోగా చెడు చేస్తుంది. నిజానికి వాళ్ళు వీళ్ళకు ప్రత్యేకంగా చెడు చేసింది లేదు. వాళ్ళెవరూ అర్చక వృత్తి తీసుకొని వీళ్ళకు పోటీ రాలేదూ, ఊళ్ళూ, ఇళ్ళూ తగలెట్టుకోలేదు.  నిజానికి ఇష్టం ఉన్నాలేక పోయినా వీరిలో ఎంతో మంది కి వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలిచ్చి భృతి కల్పించారు. ఒక వ్యక్తి తన స్వంత కారణాల వల్ల పెంచుకొన్న ద్వేషాన్ని అందరికీ అంటగట్టక్కర లేదు.



అలాగే బ్రిటీష్ వారు వెళ్ళి పోయిన తర్వాతి సామ్యవాద రోజుల్లో, గుళ్ళు, బళ్ళు ప్రభుత్వ పరం చెయ్యటం వల్ల కుల వృత్తులైన అర్చకత్వం, అధ్యాపకం, కరణీకం నుండి దూరమై, అన్ని ఉపాధుల్లొ రిజర్వేషన్ పేరిట గెంట బడి అతి పేదరికం నుండి ఇప్పుడు కొంత నిలదొక్కు కున్న ఈ కులం వాళ్ళూ, కృషిని, చదువునే నమ్ముకొన్నారు, ద్వేషాన్ని కాదు.

కనుక నాయకులారా, ఒట్టి మాటలు కట్టి పెట్టి, తమ గ్రూపు వృద్ధి కోరుకొనే వాళ్ళయితే, తము ఉచిత అవకాశాలనుండి తప్పుకొని, తగిన వారికి అవకాశాలు ఇస్తూ, వారికి ప్రభుత్వ పధకాలపై అవగాహన పెంచుతూ వారికి చదువు చెప్పి, పైకి తీసుకు రండి. వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలను కొంటే ఇరరుల పట్ల ద్వేషం పెంచటమే మార్గం.
అదేకానివ్వండి. స్వచ్చందమైన అంటరాని తనాన్ని ద్వేషం ద్వారా కల్పించక నలుగురిలో కలిసే మార్గం చూపండి. మా నాన్న గారి కజిన్ నాన్నగారితో తన డెబ్బయ్యవ ఏట అన్నమాటలు నాకు ఎప్పుడూ గుర్తుంటాయి. "ఒరే మా అమ్మ నేను ఒక్కడే కొడుకు అవ్వటం వల్ల  నన్ను చాలా గారాబం గా పెంచింది అయితే నాయన, మనకు ఎవ్వరూ మేలు చెయ్య లేదురా అంటూ చుట్టాలందరి పట్ల ద్వేషం నేర్పించింది. నేను ఇప్పుడు అందర్ని దూరం ఉంచి ధనవంతున్నయ్యాను కాని ఒంటరి వాణ్ణయ్యాను. మీకు మీఅమ్మ మంచి తనం, నలుగుర్లో కలవటం చెప్పింది. అది ఎంత పెద్ద ఆస్థో నాకు ఇప్పుడు తెలుస్తోంది అని. " అలాగా మీ పై తరాల వాళ్ళను ఒంటరి వాళ్ళను చెయ్యకండి మీ మూర్ఖత్వాలతో.  హైదరాబాదులో ఒకప్పుడు గొప్పవాళ్ళయిన ఒక మతం వాళ్ళు ఈ రోజు చదువులు లేక,  స్వార్ధపరులైన లీడర్ల వల్ల కదా రౌడీలు గా మిగిలి పొయ్యారు. లేకపోతే వీళ్ళు ఎంత చక్కటి పని మంతులు, కష్టపడ గలిగిన వాళ్ళు, వాళ్ళకు అంత పేదరికం ఏమిటి?


నాయకులే ముంచినా తేల్చినా! కనుక నాయకులు ఒక తప్పు చేస్తే అది తరాలకు కొడుతుంది. తస్మాత్ జాగ్రత్త. పెద్దవాళ్ళంటారు.,రాజులకు ఎక్కువ పాపాలు అంటుతయ్యట. తెలిసి చేసేవి తెలియక చేసేవి. డబ్బుకే అయితే ఇతర మార్గాలు చూసుకోండి పాపాలు మూటకట్టుకోకండి.

6 comments:

  1. మీ విశ్లేషణ బాగుంది.

    శ్రీవాసుకి

    ReplyDelete
  2. chaalaa baagundandee.thanks maa badha nu bayata pettinanduku.

    ReplyDelete
  3. Mee analysis chala bagundi, nenu 100% eekibhavistunnanu.

    ReplyDelete